మరికాసేపట్లో స్పీకర్ను కలువనున్న ఎంపీలు
29 May, 2018 17:12 IST
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురు మరికాసేపట్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలువనున్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డిలు గత నెలలో స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేశారు. స్వీకర్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో ఎంపీలు లోక్సభలోని స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు.