సోమవారం షర్మిల పాదయాత్ర సాగేదిలా...

19 Nov, 2012 08:55 IST

జూలకల్ (కర్నూలు జిల్లా)19 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా షర్మిల 33వ రోజు పాదయాత్ర సోమవారం 15.2 కిలోమీటర్ల మేర సాగుతుంది. జూలకల్ గ్రామ శివారు నుంచి సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభమై, జూలకల్, పొన్నకల్, గూడూరు, గుడిపాడు మీదుగా పెంచికలపాడు వరకు కొనసాగుతుంది. గూడూరు మండల కేంద్రంలో బహిరంగసభ ఉంటుంది. షర్మిల నేడు గూడూరు మండలంలోకి షర్మిల ప్రవేశిస్తారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మీడియాకు ఈ వివరాలు తెలిపారు.