విజయవాడ చేరుకున్న వైయస్ విజయమ్మ

27 Oct, 2013 13:30 IST
హైదరాబాద్, 27 అక్టోబర్ 2013:

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా జగ్గయ్యపేట మండలం షే‌ర్ మహ్మ‌ద్పేట, తిరుమలగిరి, గౌర‌వరం, ముళ్లపాడులో ఆమె పర్యటిస్తారు. అనంతరం నందిగామ మండలం రాఘవాపురం, వీరులపాడు మండలం జగన్నాథపురం వెళతారు. అక్కడ భారీ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులతో శ్రీ విజయమ్మ స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు. పంటలు దెబ్బతిన్న రైతులతో కూడా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతారు.