మంగళవారం మరో ప్రజాప్రస్థానం 15.2 కిలోమీటర్లు

16 Jul, 2013 10:32 IST
భైరిపురం (విజయనగరం జిల్లా),

16 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం మంగళవారం ఉదయం విజయగరం జిల్లా భైరిపురం నుంచి ప్రారంభమైంది. సరజలవలస, పోరలి, భూపాల రాజపురం మీదుగా వలస వరకూ ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. వలస వద్ద శ్రీమతి షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించి దత్తిరాజేరు, గొబ్బిం జంక్షన్, దత్తి జంక్షన్, మానాపురం,‌ కోమటిలంక వరకూ నడుస్తారు. రాత్రికి శ్రీమతి షర్మిల కోమటిలంక వద్ద బసచేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ పెన్మెత్స సాంబశివరాజు తెలిపారు. కాగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారానికి (విజయనగరం జిల్లాలో తొమ్మిదవ రోజు) 211వ రోజుకు చేరుకుంది. మంగళవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 15.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని రఘురాం, సాంబశివరాజు వివరించారు.