మాకు రక్షణ లేదు..భద్రత పెంచండి
23 May, 2017 14:20 IST
ప్రొద్దుటూరు: చంద్రబాబు పాలనలో విపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో భయాందోళన సృష్టింస్తోందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు 1+1 నుంచి 2+2 గన్మెన్ల భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. హింసా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని పేర్కొన్నారు.