నంద్యాల వైయస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి
26 Jun, 2017 11:54 IST
హైదరాబాద్ః వైయస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా శిల్పా మోహన్ రెడ్డి నియమితులయ్యారు. అదే సమయంలో రాబోవు నంద్యాల ఉపఎన్నికలలో వైయస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పా పేరు ఖరారైంది. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.