షర్మిల పాదయాత్రలో 286.5 కి.మీలు పూర్తి

9 Nov, 2012 21:16 IST
తుగ్గలి

(కర్నూలు జిల్లా) 9 నవంబర్ 2012: షర్మిల 23వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో శుక్రవారం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 286.5 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. తుగ్గలి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో నేటికి పాదయాత్ర ముగిసింది. శనివారం రాత్రికి తుగ్గలి శివార్లలో షర్మిల బస చేశారు. శనివారం ఉదయం తుగ్గలి నుండి 24వ రోజు పాదయాత్ర ప్రారంభమై పత్తికొండ టౌన్ దిశగా సాగుతుంది.