శ్రీమతి షర్మిల పాదయాత్రకు విశేష స్పందన

29 Nov, 2012 09:31 IST
దేవరకద్ర:

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైnస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు వి. బాలమణెమ్మ చెప్పారు. పాదయాత్ర ఏర్పాట్లపై సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో గుబులు ప్రారంభమైందన్నారు. ఆ పార్టీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రయితే రాజన్న రాజ్యం తథ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ప్రజలు గమనించి సరైన సమయంలో వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. వచ్చేనెల 3న షర్మిల పాదయాత్ర దేవరకద్రకు చేరుతుందన్నారు. అదేరోజు రాత్రి మన్యంకొండ సమీపంలోని కాకతీయ ప్రైవేట్ పాఠశాలలో షర్మిల బస చేస్తారని చెప్పారు.