షర్మిలను పరామర్శించిన వైయస్ భారతి

16 Dec, 2012 13:33 IST

హైదరాబాద్, 16 డిసెంబర్ 2012: 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో గాయపడిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిలను శ్రీ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి ఆదివారంనాడు పరామర్శించారు. రంగారెడ్డి జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల కాలికి శుక్రవారంనాడు బలమైన గాయమైంది. దాంతో శ్రీమతి షర్మిల పాదయాత్ర శని, ఆదివారాలు వాయిదా పడింది.

శ్రీమతి షర్మిలకు శనివారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందన్నారు, కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఆనంద్, డాక్టర్ హరికృష్ణ చెప్పారు. అన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి శ్రీమతి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నం నుంచే పాదయాత్ర కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి వారించడంతో శ్రీమతి షర్మిల పాదయాత్రకు దూరంగా ఉన్నారు.