225వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

30 Jul, 2013 10:45 IST
శ్రీకాకుళం 30 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారంనాడు 225వ రోజుకు చేరుకుంది. సూర్యనారాయణపురం  నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. తిడ్డిమి, సుందరాడ, సిరియాకండి, పెద్దపద్మాపురం, మెళియాపుట్టి, చాపర, పట్టుపురం గ్రామాల మీదుగా ఆమె పాదయాత్ర సాగుతోంది.