'సమస్యలపై పోరులో ముందున్న వైయస్‌ఆర్‌సిపి'

28 Jan, 2013 13:22 IST
నెల్లూరు, 28 జనవరి 2013: ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు, శ్రేణులు ఎప్పుడూ ముందే ఉంటారని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని బాలాజీనగర్‌లో మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు పార్కు నిర్మాణానికి అవసరమైన నిధులను తన ఎం.పి. కోటా నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నెల్లూరులో ప్రజాహిత సేవా సమితి ఆధ్వ్యంలో జరిగిన రిటైర్డు ఉద్యోగుల సన్మాన సభలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.