ప్రజల కోసం భీష్మించుకూర్చున్నారు

7 Apr, 2018 15:36 IST
ఢిల్లీ: ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్న ప్రజల కోసం దీక్ష చేస్తానని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి భీష్మించుకొని కూర్చున్నారని వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వయస్సు 73 సంవత్సరాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనగా ఉందన్నారు. అయినా ప్రజల కోసం దీక్ష చేస్తానంటున్నారన్నారు.వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్లు ఏం చెబుతారో చూడాలన్నారు.