బాబుది నీతిమాలిన రాజకీయం
5 Dec, 2017 13:49 IST
ప్రకాశం: ఫిరాయింపులతో చంద్రబాబు నీతిమాలని రాజకీయాలు చేస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి కారణంగానే పోలవరం టెండర్లను కేంద్రం నిలుపుదల చేసిందని విమర్శించారు. రాష్ట్రం మాఫియాకు అడ్డగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు.