ఏడాది సస్పెన్షన్ ఎందుకంటే

18 Dec, 2015 17:40 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలోనే మంత్రులు, ఇతర నాయకులు నడుస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల్ని  తిట్టడమే లక్ష్యంగా చెలరేగుతున్నారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి విపక్షాన్ని తిట్టడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనిత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మీద మాటల దాడి చేశారు. వైఎస్సార్సీపీ మహిళా సభ్యురాలు రోజా మీద ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేశారు. వ్యవహారాన్ని పక్క దారి పట్టించేందుకు మార్గాలు వెదకుతున్న చంద్రబాబు అండ్ కో దాన్ని పక్కాగా అమలు చేశారు. వెంటనే దీన్ని ఆచరణలోకి తెచ్చి చూపించారు.