రైతులంతా సుభిక్షంగా ఉండాలి
9 Apr, 2016 13:07 IST
తిరుమల) తెలుగు రాష్ట్రాల్లోని రైతులంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. సతీమణి, కుమారుడు, కోడలు ఆయన తో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వానలు సకాలంలో కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుకొన్నట్లు ఆయన వెల్లడించారు.