రైతులంతా సుభిక్షంగా ఉండాలి

9 Apr, 2016 13:07 IST

తిరుమల) తెలుగు రాష్ట్రాల్లోని రైతులంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. సతీమణి,  కుమారుడు, కోడలు ఆయన తో పాటు ఉన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వానలు సకాలంలో కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుకొన్నట్లు ఆయన వెల్లడించారు.