తుందుర్రులో పోలీస్ రాజ్యం
8 Mar, 2017 11:15 IST
పశ్చిమగోదావరిః తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఆందోళన చేపట్టారు. పోలీసులు పలువురు మహిళలను అరెస్ట్ చేశారు. ఆక్వాఫుడ్ బాధితులకు మద్దతుగా నిలిచిన వైయస్సార్సీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. మహిళల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న పలువురు వైయస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు.