హిందూపురంలో వైసీపీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్

29 Aug, 2015 12:52 IST
హిందూపురం: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ అనంతపురం జిల్లా హిందూపురంలో  ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేతలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పట్టణంలోని సద్బావన సర్కిల్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న పార్ట శ్రేణులపై పోలీసులు కావరం ప్రదర్శించారు. లాఠీఛార్జ్ చేసి నాయకులను చెల్లాచెదురు చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వినయ్ తో పాటు పది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ కాసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులు హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో  సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. విజయ్,దాదులు  రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్  చేశారు.  వైసీపీ బంద్ తో గుంతకల్లు పట్టణంలో జనజీవనం స్తంభించింది.  200  పెట్రోల్, డీజిల్ రవాణా ట్యాంకర్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.