చంద్రబాబుకి ప్రజలే బుద్ధి చెబుతారు

6 Jun, 2016 11:54 IST

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రను అడ్డుకొనేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం  పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు వైఎస్ జగన్‑పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు.