పశ్చిమగోదావరి : కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన దంపతుల తమ కుమార్తెకు అదే ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేయించారు. దీంతో ఆ దంపతులు మురిసిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం తీసుకువస్తామన్నారు. చిన్న బిడ్డలను ఏ స్కూల్కు పంపించినా సరే ఆ తల్లి ఖాతాలో ప్రతి ఏటా రూ.15 వేలు అందజేస్తామన్నారు. విద్యార్థులకు హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు చెల్లిస్తామని, మీ బిడ్డలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.