శ్రమించే వారికి పార్టీలో గుర్తింపు: వైఎస్సార్ సీపీ

3 Feb, 2015 16:00 IST
తిరుపతి: శక్తివంచన లేకుండా పనిచేసే ప్రతిఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని వైఎస్సార్ సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీయువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేతం జయచంద్రారెడ్డి (రామారావు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన భూమన కరుణాకర్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఈ పదవి వచ్చేలా కృషి చేసిన భూమనకు రుణపడి ఉంటానిని పేర్కొన్నారు.