అధికార ప్రతినిధులుగా పైలా, రాజశేఖర్ లు
13 Oct, 2017 11:38 IST
హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఈ క్రింది పేర్కొన్న నాయకులను ఆయా పదవులలో నియమించడమైనది.
విజయవాడకు చెందిన పైలా సోమినాయుడు, ఒంగోలుకు చెందిన కాకుమాను రాజశేఖర్ లు రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వి.ఖాదర్ భాషా రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.