పాకిస్తాన్ ద్వంద్వ నీతిని వీడాలి
10 Mar, 2017 17:11 IST
న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ దేశం ద్వంద నీతిని మానుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన పాక్, జమ్ము–కశ్మీర్ అంశాలపై మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రదేశమని ప్రపంచ దేశాలు ప్రకటించాయని గుర్తు చేశారు. పాకిస్తాన్పై భారత్ అప్రకటిత యుద్ధం చేస్తోందని చెప్పారు. సింధు నది జలాలు 80 శాతం పాకిస్తాన్ వాడుకుంటోందన్నారు. పాకిస్తాన్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది కాబట్టి..ఇండియా తీరులో కూడా మార్పు రావాలని విజయసాయిరెడ్డి కోరారు.