పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక పూజ
20 Sep, 2012 01:23 IST
హైదరాబాద్, 19 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక పూజను ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, పలువురు నాయకులు, కార్యాలయ సిబ్బంది అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.