డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ గా వేమారెడ్డి

30 Dec, 2015 14:02 IST
వైఎస్సార్ జిల్లాః  వైఎస్సార్సీపీ నేత పాలగిరి వేమారెడ్డి వైఎస్సార్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కోసం జిల్లా సహకార అధికారి పోమ్యానాయక్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. వేమారెడ్డి ఒక్కరే నామినేషన్ వేయటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో  ఆయన్ను వైఎస్ చైర్మన్‌గా నియమించారు. డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆడిట్ అధికారిణి సుభాషిణి పాల్గొన్నారు.