పాదయాత్ర చారిత్రక అవసరం, చరిత్రాత్మకం
27 Oct, 2012 18:32 IST

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషం వల్ల ఉద్దేశపూర్వకంగానే కుతంత్రాలు పన్నుతూ వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ జనం నమ్ముతున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను తీర్చే సత్తా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని జనం విశ్వసిస్తున్నారని, జైళ్లు నోళ్ల తెరిచినా, సంకెళ్లు ఒళ్లు విరిచినా, ప్రజల కోసం నిరంతరం ప్రజాసమస్యల పట్ల అనునిత్యం వెదుకులాడే కళ్లు ఎప్పుడూ జనం కోసమే ఉన్నాయనీ జనం నమ్ముతున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి భూమన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా, రాక్షసంగా, అమానవీయంగా జైలులో పెట్టారనీ, ఒక్కరోజు కూడా అధికారంలో భాగస్వామి కాని వ్యక్తివి కుతంత్రాలు పన్ని అరెస్టు చేశారనీ జనం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. షర్మిల పాదయాత్రకు లభించిన విశేష ఆదరణే దీనికి రుజువని ఆయన అన్నారు. నిజానికి నాడు వైయస్ ప్రజాప్రస్థానానికి లభించిన ప్రజాదరణ కన్నా షర్మిల పాదయాత్రకు ఎక్కువగా ఆదరణ లభిస్తోందని ఆయన అంచనా వేశారు. వైయస్ కుటుంబం జనం కోసమే జీవిస్తుందని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు. ధర్మవరం సభలో నలభై వేల మంది కంటే ఎక్కువగా జనం హాజరైన సంగతిని ఆయన ప్రస్తావించారు. కాగా, హైటెక్కులతో, ట్రిక్కులతో చంద్రబాబు సాగిస్తోన్న పాదయాత్రను జనం నమ్మడం లేదని, అది విషాదయాత్రగా మిగిలిపోతుందనీ ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మరని ఆయన అన్నారు. స్టాండ్ బైని తెచ్చుకుని బాబు పాదయాత్ర కొనసాగిస్తారేమోనన్నారు. వైయస్ఆర్ సీపీలో చేరడానికి చాలా మంది నాయకులు ఉవ్విళ్లూరుతున్నారనీ, బాబు పాదయాత్రలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఎమ్మెల్యే రాలిపోతాడని ఆయన ఎద్దేవా చేశారు. పదిహేను రోజుల పాటు అనంతపురం జిల్లాలోనూ, వారం పాటు కర్నూలులోనూ పాదయాత్ర చేశాక, షర్మిల మరో ప్రజాప్రస్థానం తెలంగాణలోకి అడుగుపెడుతుందని భూమన చెప్పారు.