ఉల్లి రైతులకు భరోసా

26 Nov, 2017 12:57 IST
ఎర్రగుడి సమీపంలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని స్థానిక ఉల్లి రైతులు కలుసుకున్నారు. జననేతకు తమ చేలల్లోని ఉల్లి పంటను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లో గిట్టుబాటు ధరలు లభించడం లేదనీ, దళారీలకు అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారని వారు తమ సమస్యలను వివరించారు. వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతానంటూ ఈసందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు.