అవిశ్వాస తీర్మానం నోటీసు సమర్పణ

23 Dec, 2015 11:37 IST

హైదరాబాద్) అసెంబ్లీ స్పీకర్ పక్షపాత ధోరణికి నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసును అందచేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ నోటీసును అందచేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు దీన్ని అందచేశారు. సభలో స్పీకర్ అనుసరిస్తున్న పక్షపాత ధోరణికి నిరసనగా ఈ నోటీసును అందచేశారు. సభ ప్రోరోగ్ కాలేదని కాబట్టి సభ ను నిబంధనలకు అనుగుణంగా సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించాలని కోరారు.