ఆత్మగౌరవ యాత్రపై చంద్రబాబుకే స్పష్టత లేదు
2 Sep, 2013 12:44 IST
హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2013:
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆత్మగౌరవ యాత్రపై ఆయనకే స్పష్టత లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరితో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు అధికార దాహమే తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని జ్యోతుల వ్యాఖ్యానించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ సూర్ఫితోనే సమైక్యవాదం వినిపిస్తామని ఆయన తెలిపారు.