వైయస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కార్యవర్గం ఎంపిక
4 Feb, 2017 18:45 IST
రాయచోటి: రాయచోటి ఆర్టీసీ డిపో పరిధిలో వైయస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. శనివారం వైయస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాజారెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గౌరవాధ్యక్షుడుగా సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, డిపో అధ్యక్షుడుగా పి.శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా బి.శరత్బాబు, ఉపాధ్యక్షులుగా ఎంఎం నాయక్, సరస్వతి, జాయింగ్ సెక్రటరీలుగా కమలాంబ, వాసులు, ఎంజే నాయక్, ఇబ్రహీం,రామాంజులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొండయ్య, ఎంయు నాయక్, చంద్ర, ఎంజీ నాయక్, పబ్లిసిటీ సెక్రటరీలుగా బీఎం నాయక్, డీఎస్ వాసులు, ఎ‹స్. బాషా, బీఆర్ నాయక్, కోశాధికారిగా వీపీ రెడ్డిలు, గ్యారేజీ సెక్రటరీగా ఎస్. అబ్దుల్లా, జాయింట్ సెక్రటరీగా ఎంఎస్ నాయక్లు ఎంపికయ్యారు.