నెల్లూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా
7 Aug, 2018 12:25 IST
నెల్లూరు: నిరుద్యోగ వంచనపై వైయస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకు ముందు నగరంలో యువకులు, విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. నిరుద్యోగ భృతి రూ.2 వేల చొప్పున ప్రతి కుటుంబానికి రూ. లక్ష చెల్లించాలని డీఆర్వోకు వైయస్ఆర్సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.