పేదలకు ఆరోగ్యశ్రీని దూరం చేయాలని చూస్తే ఊరుకోం

19 Jan, 2017 18:02 IST

తిరుపతిః మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని దూరం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమేనని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ పథకాలను బాబు నీరుగారుస్తున్నారని విమర్శించారు.