నెల్లూరు: రాష్ట్రానికి వైయస్ జగన్ నాయకత్వం అవసరమని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కుమారుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే తాను వైయస్ఆర్సీపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. ఏపీని టî డీపీ, బీజేపీలు కలిసి మోసం చేశాయని, రాష్ట్రం బాగుపడాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే అన్నారు. జననేతను ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.