విశాఖ: వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాంబిల్లి మండలానికి చెందిన నావెల్ బేస్ నిర్వాసితులు మంగళవారం వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. న్యాయం కోసం ఆరు గ్రామాల ప్రజలు ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైయస్ జగన్ను కోరారు.