పాదయాత్రకు నాటా మద్దతు

9 Sep, 2018 13:05 IST
విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ మద్దతు తెలిపింది. విశాఖపట్నంలో కొనసాగుతున్న పాదయాత్రలో నాటా నాయకురాలు సుధారాణి వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ మేరకు నాటా సంఘం మద్దతు ఉంటుందని, ప్రజల కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై అమెరికా నుంచి రావడం జరిగిందని చెప్పారు.