నైతిక విజయం వైయస్ఆర్ కాంగ్రెస్దే
30 Aug, 2017 21:07 IST
జి.కొండూరు (గుంటూరు): నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ గెలిచినా నైతిక విజయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ మండల కన్వీనర్ మందా చక్రధరరావు బుధవారం ఓ ప్రకటనలో అన్నారు. సానుభూతి,ధన ప్రభావం వల్లన టీడీపీ గెలిచింది కానీ లేదంటే డిపాజిట్లు కూడా దక్కేవి కాదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లనే నంద్యాలకు అభివృద్ధి పేరుతో 1200 కోట్లు మంజూరు చేశారని లేదంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చేవారు కాదని ఆ ప్రకటనలో విమర్శించారు.