నేడు షర్మిల ప్రజాప్రస్థానం షెడ్యూల్
5 Nov, 2012 10:01 IST
అనంతపురం :
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 19 వరోజు రాగులపాడు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆమె పందికుంట చేరుకుంటారు. భోజన విరామం అనంతరం తాట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరుల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వజ్రకరూర్లో షర్మిల బసచేస్తారు.