ఎవరితోనూ పోటీ పడటం లేదు
19 Mar, 2018 10:09 IST
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అవిశ్వాస తీర్మానంపెట్టే విషయంలో ఎవరితోనూ పోటీ పడటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చజరిగితే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎవరి అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా మేం మద్దతిస్తామన్నారు.