రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ నిర్వహించాలి

11 Nov, 2017 11:44 IST
–ఎంపీ వరప్రసాద్‌
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని వైయస్‌ఆర్‌సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యం ప్రకారం జరగని సభకు మేం వెళ్లి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ జరిగిన నాడే మా ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.