ప్రజాసమస్యలపై ఎంపీ పొంగులేటి దీక్ష

17 Nov, 2015 13:03 IST
హామీలు విస్మరించిన సర్కార్..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 23,24న దీక్ష..

ఖమ్మః కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యపు పాలనను నిరసిస్తూ  వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో దీక్షకు సిద్ధమయ్యారు. ఇచ్చిన హామీలు  నెరవేర్చడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా..ఈనెల 23,24 తేదీల్లో పొంగులేటి జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతారని పార్టీ నేతలు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, వెంకటేశ్వర్ రావులు ప్రకటించారు. 

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ  నేతలు మండిపడ్డారు. నిత్యవసర ధరలు ఆకాశాన్నంటినా కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. దళితులకు భూపంపిణీ కార్యక్రమం కాగితాలకే పరిమితమైందని నేతలు ఎద్దేవా చేశారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో 400 ఇళ్లతో పేదలందరికీ ఎలా సర్దుబాటు చేస్తారని  సర్కార్ ను ప్రశ్నించారు. 

దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ను సత్వరమే పూర్తిచేసి 6 లక్షల ఎకరాలకు నీరిందించాలని..కిన్నెరసాని, సింగభూపాలెం, వైరా, పాలేరు రిజర్వాయర్లను అనుసంధానం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు నిరసిస్తూ ప్రజాసమస్యలపై...ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న దీక్షకు పార్టీలకతీతంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మద్దతు ఇవ్వాలని కోరారు.