తిరుపతి: ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబుకు మాతృవియోగం కలిగింది. మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ కన్నుమూశారు. ఈ మేరకు మోహన్బాబుకు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.