28 నుంచి ఎమ్మెల్యే రోజా పాదయాత్ర..
26 Nov, 2017 19:26 IST
చిత్తూరు: నవంబరు 28 వతేదీ నుంచి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర చేయనున్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోజా పాదయాత్ర చేయనున్నారు. నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది.