ఎమ్మెల్యే రోజా నివాళి
23 Feb, 2017 13:05 IST
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనప్పరెడ్డి మృతికి ఎమ్మెల్యే రోజా నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని తెరణకు చెందిన పార్టీ కార్యకర్త కనప్పరెడ్డి మృతి చెందడటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా నగరికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.