– అవినీతి నాయకులకు అధిపతి బాబే
చిత్తూరు: అవినీతి నాయకులకు చంద్రబాబే అధిపతి అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా విమర్శించారు. వంగి వంగి డండాలు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సొంత మామ ఎన్టీఆర్కు వంగి దండం పెట్టిన చంద్రబాబు ఆ తరువాత ఆయన్ను ఏం చేశారో అందరికి తెలుసు అన్నారు. మోడీ, పవన్కు దండాలు పెట్టి అధికారం చేజిక్కించుకున్నది ఎవరో అందరికి తెలుసు అన్నారు. నాడు వైయస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్తో చంద్రబాబు కుమ్మకై, ఎ్రరనాయుడు, శంకర్రావులతో అక్రమ కేసులు పెట్టించారన్నారు. ఇప్పుడు దాన్నే అస్త్రంగా వాడుకోవాలని చూడటం చంద్రబాబు అవివేకమన్నారు. వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనా చౌదరి ఏ బేసిక్తో కేంద్ర మంత్రిని చేశావని ప్రశ్నించారు. వందల కోట్లు బ్యాంకులకు ఎగగొట్టి వైజాగ్లో ప్రభుత్వ భూములను కాజేసిన గంటా శ్రీనివాసును ఏ విధంగా అసెంబ్లీ కేబినెట్ మంత్రిగా చేశావని ప్రజలు అడుగుతున్నారన్నారు. 15 కేసులు ఉన్న చింతమనేని ప్రభాకర్ను అసెంబ్లీ విప్గా ఎలా నియమించావని ప్రశ్నించారు. కాల్మనీ సెక్స్రాకెట్లో ఉన్న వ్యక్తులు టీడీపీలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాను డైవర్ట్ చేసేందుకు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీకి దమ్ముంటే రాజ్యసభ పుటేజీలు తీసుకురావాలన్నారు. బహిరంగ చర్చకు ఎందుకు టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు.