ఎమ్మెల్యే రాజన్న దొర ఆందోళన

13 Apr, 2018 16:38 IST
విజయనగరం: ఐటీడీఏ పాలక వర్గ సమావేశానికి వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొరను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గేటు ముందు ఎమ్మెల్యే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజా ప్రతినిధిగా గిరిజన సమావేశానికి వెళ్లే హక్కు ఉందని, అలాంటి తనను అడ్డుకోవడం బాధాకరమన్నారు.