పేదల ఆస్తులు కొట్టేయడమే బాబు లక్ష్యం
29 Dec, 2017 13:21 IST
హైదరాబాద్: చంద్రబాబు నాయకుడు అధికారులను భయపెట్టి అవినీతికి పాల్పడుతున్నారని, పేదల ఆస్తులు కొట్టేయడమే ఆయన లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకుల దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అక్రమంగా ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్రం రూపొందించిన 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10కు S చంద్రబాబు ప్రభుత్వం సవరణ చేసిందన్నారు . ఉత్తరాంధ్రలో లక్ష ఎకరాలను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.