మూడో రోజూ అదే మైక్ కట్ లు
19 Dec, 2015 09:50 IST
శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మైక్ కట్ చేయటం ఆనవాయితీగా మారింది. మూడో రోజు సభ సమావేశం అయ్యాక ఎమ్మెల్యే రోజా ను సస్పెండ్ చేయటం అన్యాయం అనీ, నిబంధనలకు విరుద్దం అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సభ ద్రష్టికి తెస్తుంటే పదే పదే మైక్ కట్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టేందుకు జరుగుతున్న వ్యవహారంగా దీన్ని బావించాలని ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయ పడుతున్నారు.