28న మండల స్థాయి సమావేశం
26 Apr, 2017 18:05 IST
పిట్టలవానిపాలెం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఈనెల 28వ తేదిన చందోలులో నిర్వహించనున్నట్లు పార్టీ కన్వినర్, చందోలు ఎంపీటీసీ సభ్యులు షేక్బాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి పాల్గొంటారని తెలిపారు. మండలంలోని వైయస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.