మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు

21 Nov, 2012 16:15 IST
విశాఖపట్టణం:

మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళమని ప్రజలే ఒత్తిడిచేస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ నిజాయితీ, ధైర్యాన్ని చూసి ఎమ్మల్యేలు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.