'ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్
21 Feb, 2017 18:25 IST
విశాఖ: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసే సమయంలో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పి.వి.ఎన్. మాధవ్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని వైయస్ఆర్సీపీ అనకాపల్లి కార్యాలయ ఇన్చార్జ్ ఏడువాకల నారాయణరావు మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆగడాలను పట్టభద్రులు చూస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసని పేర్కొన్నారు.