సీమకు అన్యాయం..మరో ఉద్యమానికి ఊతం
25 Jun, 2016 12:38 IST
వైయస్సార్ జిల్లా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ సర్కార్ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ మరో ఉద్యమానికి ఉతమిస్తుందని వారు ఆరోపించారు. అప్పట్లో కృష్ణాజలాలు రాజధానికి తరలించుకుపోయారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తరలిస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో రాయలసీమ ఉద్యోగుల వాటా ఎంతో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాబు సర్కార్ను డిమాండ్ చేశారు. కొత్త నియామకాల్లో రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదని ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.